భారత దేశపు పరుగుల రాణిగా పేరుగాంచిన పి.టి.ఉష 1964 జన్మించింది. ఈమె పూర్తి పేరు పిలావుళ్ళకండి తెక్కే పఱంబిల్ ఉష . 1979 నుంచి, భారతదేశం తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని, దేశానికి పలు విజయాలను అందించింది. ఈమె ముద్దు పేరు పయోలి ఎక్స్‌ప్రెస్. 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలు. ఒక రజిత పతకం సాధించింది. 1982 ఢిల్లీ ఆసియా క్రీడలలో కూడా 2 రజిత, 1990 ఆసియాడ్ లో 3 రజిత, 1994 ఆసియాడ్ లో ఒక రజిత పతకాలు సాధించింది. 

పీటి ఉషను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది అమ్మాయిలు  అథ్లెటిక్స్ రంగంలతో రాణించారు.   1984 లాస్‌ ఏంజిల్స్ ఒలింపిక్స్లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం 1985లో పద్మశ్రీ మరియు అర్జున అవార్డు లతో సత్కరించింది. 

చిన్నతనం నుంచి ఎంతో చలాకీగా గెంతులేస్తూ పరుగులు పెట్టిన పీటీ ఉష టాలెంట్ ఏంలో ఆమె కోచ్   ఓ. నంబియార్ అప్పట్లో పసిగట్టాడు..అంతే ఆమెకు ఎంతో కఠినమైన శిక్షణ ఇస్తూ ఆమెలో మనోధైర్యాన్ని నింపారు. అప్పట్లో దేశంలో మహిళా అథ్లెట్ల సంఖ్య చాలా తక్కువ. అథ్లెటిక్ సూట్ ధరించి ట్రాక్ పై పరుగెత్తడం అరుదుగా జరిగేది. 1980 రష్యా ఒలింపిక్స్ లో పాల్గొన్ననూ ఆమెకు అది అంతగా కలిసిరాలేదు. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో 100 మీ. మరియు 200 మీటర్ల పరుగులో రజత పతకం పొందింది.

1985లో కువైట్లో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో ఉష బంగారు పతకం పొందడమే కాకుండా, కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 1985లో జకార్తాలో జరిగిన 6 వ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్ పోటీలలో ఈమె 5 బంగారు పతకాలను సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అంతర్జాతీయ క్రీడాజీవితంలో మొత్తం మీద ఈమె 101 స్వర్ణ పతకాలను సాధించింది.తాజాగా భారత దిగ్గజ అథ్లెట్‌ పిటి ఉషకు అరుదైన గౌరవం దక్కింది.

80వ దశకంలో ఆసియా ప్రఖ్యాత స్ర్పింటర్‌గా కీర్తి పతాకాన్ని ఎగురవేసిన 55 ఏళ్ల ఉషకు ఆసియా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ (AAA)లోని అథ్లెట్ల కమిషన్‌లో సభ్యురాలిగా చోటు దక్కింది. ఈ నేపథ్యంలో పీటీ ఉష..హ్యామర్‌ త్రోలో మాజీ ఒలింపిక్‌ చాంపియన్‌ యూజ్బెకిస్థాన్ కు చెందిన ఆండ్రీ అబ్దువలియెవ్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల AAA అథ్లెట్ల కమిషన్‌లో ఓ సభ్యురాలిగా వ్యవహరిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: